సాహిత్యతత్వాన్ని ఆసాంతంగా ఆకళింపు చేసుకుని, శారదాదేవి కటాక్షానికి నోచుకున్న కాటూరి, దేవులపల్లి, విశ్వనాథ వంటి మహనీయకవులందరూ పధ్నాలుగు పదిహేను సంవత్సరాలకే సారస్వతాంశ పూర్ణంగా పెనవేసుకుని ఉన్న బాలకవిగా గుర్తుపట్టారు మల్లంపల్లి శరభయ్యగారిని. మల్లంపల్లి వారి వంశమంతా వీరశైవమత పరిమళాలు ఆంధ్రదేశమంతటా ప్రాకింపజేసి, జ్ఞానరోచిస్సులను నలుదిశలా చిందింపజేసిన ఉన్నతవ్యక్తిత్వాలకు ఆకరమైనటువంటిది. వీరశైవాంధ్రవాఙ్మయానికి వారు చేసిన సేవ అద్వితీయం. ఈ వంశంలోని పూర్వీకులు శివదీక్షాగురువులు.
వర్ణపరాగం
A Soul of Light.
Monday, 23 March 2026
Saturday, 10 January 2026
విబుధస్పందన - 2
Friday, 24 October 2025
ఒక నూత్నాలంబన
మానవజీవితంలో అత్యంతవిలువైన వస్తువు ప్రశాంతత. ఈ ప్రశాంతతను ప్రకృతి చిన్నతనంలో మనిషికి కానుకగా ఇస్తుంది. పెద్దైయ్యాక, తమకంటే ఒకటి రెండు పెద్దతరాల వాళ్లు కళ్లముందే తిరుగుతూ అహరహం శ్రమించి, వేరే దేనికోసమూ పడని తాపత్రయమంతా పడి ధర్మాధర్మాల నియమాలను ఏర్పరిచి నిర్మించిన కుటుంబమనే వ్యవస్థ వాటిని పాటిస్తూ కలిసిమెలిసి జీవించిన మనుషులకు కొంతకాలం ముందువరకూ ఆ ప్రశాంతతను ఇస్తూ వచ్చింది.
Wednesday, 22 October 2025
విబుధస్పందన
సాహిత్యవిద్యానిష్టాతులు, స్వయంగా అద్వితీయ కవి విమర్శకులూ అయిన శ్రీ చీర్ల చంద్రశేఖర్ గారు "హృదయావి" కావ్యంపై తమ స్పందనను వ్రాశారు. వారికి అనేక నమఃపూర్వక ధన్యవాదాలతో దానిని ఇక్కడ ఉంచుతున్నాను.
Sunday, 6 July 2025
ఒక పిల్లఁగ్రోలువాఁడు
ప్రార్థన చేయగలగడం మానవజాతికి ఉన్న గొప్ప వరం. భగవంతుడి కోసం బుద్ధి తలుపులని తెరుచుకున్న మనిషి అహంకారాన్ని తగ్గించి, బాలుడిగా చేసి, ఆలోచనలనే ఎల్లలను తెంచి, ఆయుష్షుని పెంచే సంజీవని ప్రార్థన. ఈ వస్తువే కనుక ఉండి ఉండకపోతే, పెరిగే వయసుతో పెరిగే కుదింపుల స్వతంత్రత శిరసుమీద పెట్టే బరువుని మనిషి మోయడం అసాధ్యమయి ఉండేది.
Friday, 4 July 2025
అలమేలుమంగాస్తవము
మాత్రాఛందస్సులలో అత్యంత ప్రసిద్ధి పొందినవి చతుర్మాత్రల జాతి ఛందస్సులే అని చెప్పాలి. ఈ చతుర్మాత్ర గతి ఉన్న గీతాలు వినపడని రసపిపాసుల చెవులు ఎక్కడా ఉండవు. 'చందన చర్చిత నీలకళేబర పీత వసన వనమాలీ' అని గీతగోవిందకారుడు దివ్యలోకాలలో ఉన్న కవితాకన్యని క్రిందకి దింపి నాట్యం చేయిస్తున్నపుడూ, వల్లభాచార్యుడు 'అధరం మధురం నయనం మధురం' అంటూ తీపి తేనెకే కాదు, కృష్ణవర్ణన చేసే గీతికీ ఉంటుందని నిరూపణ చేసినప్పుడూ, శంకరులు 'భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే' అని భవ్యబోధ సలిపినపుడూ ఈ నాలుగు చిటికెలంత పొడుగైన మాటలే వారికి ఊతమయ్యాయి.
Saturday, 28 June 2025
జనార్దనాష్టకం
కందుకూరి రుద్రకవి పదహారవ శతాబ్దం నాటి వాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడని కొంతమంది అంటారు. సుగ్రీవవిజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథాలను రచించాడు. కానీ ఈయనలోని మహాకవి బయటకి వచ్చింది యెనిమిది పద్యాల నిడివి ఉన్న ఒక కవితలో.
Thursday, 26 June 2025
కాసిని కాళిదాసు చాటువులు
కశ్చిద్వాచం రచయితుమలం శ్రోతుమేవాపరస్తాం
కల్యాణీ తే మతిరుభయథా విస్మయం న స్తనోతి।
నహ్యేకస్మిన్నతిశయవతాం సన్నిపాతో గుణానాం
ఏకః సూతే కనకముపలస్తత్పరీక్షాక్షమోఽన్యః॥
Friday, 16 May 2025
తేలిక తాలూకు మహిమ
నాథే యాతే మధుపుర మతి
క్షోభ విభ్రష్టచిత్తా
గోపీ కాచిత్కలయతి సఖీ
రంతరంగాః సమీపే
ప్రాణత్యాగాదతి గురుతరే
తస్యబంధోర్వియోగే
కేన స్థేయం ముహురిత వచో
వ్యాకులా స్తా బభాషే.
Sunday, 11 May 2025
వేమన గురువు చెప్పిన విముక్తివిద్య
"తునాతున్క లగుచున్న 'కడిద'ము అను నల్లని రంగుపూత గల కాగితముపై పిండిబలపముతో వ్రాయబడియున్న యీ పద్యము లొక ప్రాచీన శతకములోనివి" అన్న గగుర్పాటు కలిగించే వాక్యంతో భారతి పత్రిక 1930 వ సంవత్సరం మార్చి సంచికలో "వటమూలమందిరా!" అన్న శీర్షికతో ఈ ఐదు పద్యాలు అచ్చయ్యాయి.
Subscribe to:
Comments (Atom)






.jpg)


